ఉద్యోగులు , పెన్షనర్లు -ఆరోగ్య పరీక్షలు

రాష్ట్రంలో  పనిచేస్తున్న ఉద్యోగులు -పెన్షనర్లు అందరికి సంవత్సరానికి ఒక సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖా జిఓ ఆర్ టి :492 తేదీ:27-09-2018 న జారీ చేసినది దీని ప్రకారం:

ఉద్యోగులు , పెన్షనర్లు -ఆరోగ్య పరీక్షలు ( Master Health Checkup):

  1. తొలుత ఉద్యోగులు , పెన్షనర్ల కు వారి జీవిత భాగస్వాములకు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు 
  2. దీని కోసం అయ్యే ఖర్చు మొత్తం రూ  4700/- ఉద్యోగులు /పెన్షనర్లు , ప్రభుత్వం చేరి సగం భరించాలి 
  3. 40 సంవత్సరాలు దాటినా వారందరు హెల్త్ చెక్అప్ చేయించుకోవచ్చు 
  4. పరీక్షలు చేయించుకున్న తేదీ నుండి 12 నెలల తరవాత మలి విడత ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తరవాత ప్రతి సంవత్సరం వైద్యప4రీక్షలు చేయించుకోవచ్చు 
  5. ఆరోగ్య పరీక్షలు నివేదికలు ఆన్లైన్ లో ఉద్యోగులు చూసుకునేందుకు డిజిటల్ లాకర్ సౌకర్యం కల్పిస్తారు 
  6. ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న ఏరియా ఆస్పత్రులలో బోధనాసుపత్రులలో పాటు ట్రస్ట్ కు అనుబంధముగా ఉన్న 400 ప్రైవేట్  ఆసుపత్రులలో ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నది 
  7. ప్రాధమికంగా ను మరియు తర్వాత చేసే టెస్ట్ లు జాబితా ఈ క్రింది GO No:492 ద్వారా పొందవచ్చు 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top