Central Budget 2019 -20 Updates

ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. బ్రిటిష్‌ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కనబెట్టి బ్రీఫ్‌ కేస్‌కు బదులుగా ఎర్రటి వస్త్రంలో బడ్జెట్‌ పత్రాలను తీసుకొస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆమె చాటి చెప్పారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో.. గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశామని చెప్పారు.

2019-20 బడ్జెట్ హైలెట్స్..



120 కోట్ల మంది ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు పాన్‌కార్డ్ లేకుంటే ఆధార్ చూపించవచ్చు. రెండింట్లో ఏదైనా చూపించవచ్చు.

రూ.1.50 లక్షల వరకు గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ

*దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం

రూ.5లక్షలకు ఆదాయపన్ను పరిమితి


*విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు

*'జల్ వికాస్ మార్గ్' పథకం ద్వారా అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యత

*3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కోసం 'ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం'

*ఏటా వార్షికాదాయం రూ.1.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు ఇందుకు అర్హులు

*ఈ పథకం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ ఉంటే చాలు

ఇండోర్ ఔట్ డోర్ స్ల్పిట్ ఏసీలపై 10 శాతం నుంచి 20శాతానికి పెంపు

*లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా పెంచేందుకు నిర్ణయం

*ఇందుకోసం సెబీతో చర్చించిన కేంద్రం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయాలని సూచన
బడ్జెట్ 2019:

* ఆదాయపు పన్ను శ్లాబులలో ఎటువంటి మార్పు లేదు

* 5లక్షల లోపు ఆదాయం కల వారికి పన్నులేదు

ఇంటి ఋణంపై వడ్డీ 3.5లక్షల వరకు మినహాయింపు.(45 లక్షల లోపు ఋణం తీసుకున్నవాళ్ళకు)
*సెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఏర్పాటు
బడ్జెట్ 2019:

* ఆదాయపు పన్ను శ్లాబులలో ఎటువంటి మార్పు లేదు

* 5లక్షల లోపు ఆదాయం కల వారికి పన్నులేదు

*సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుబడులు(ఈక్విటీ, అప్పు, మ్యూచువల్ ఫండ్) సమీకరించేలా త్వరలో నిబంధనలు

*ఒకే దేశం.. ఒకే గ్రిడ్‌ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.

* నవీన భారత రూప కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం.

* 2014-15తో పోలిస్తే, ఆహార భద్రతకు రెట్టింపు నిధులు

* 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపునకు దూసుకెళ్తున్నాం

* రైల్వేల్లో 50లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది. దీని కోసమే పీపీపీ అమలు చేస్తున్నాం

* మౌలికవసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు

* భారత్ మాల కార్యక్రమంలో రోడ్లు, సాగర్ మాల సాయంతో నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నాం

* పౌరుల ఆహార భద్రత కోసం కేటాయిస్తున్న నిధులను రెట్టింపు చేశాం

* చిన్నచిన్న పట్టణాలకు విమానాయాన సౌకర్యం కల్పించేందుకు 'ఉడాన్' పథకం తీసుకొచ్చాం

* ప్రపంచంలోనే భారత్ ఈరోజు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
కేంద్ర బడ్జెట్ లో అంశాలు...
* గ్రామాల్లో పట్టణాన్ని మించే సదుపాయాల అమలు.

*రైతులకి ఏటా 6000 రూపాలయ నగదు సాయం.

*ఆయుష్మాన్‌ భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం.

*దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకూ విద్యుత్‌ సౌకర్యం.

*మారుమూల ప్రాంత గ్రామాలకూ బస్సులు.

*2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఏర్పాటు.

*దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి.

*దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్‌, త్వరలోనే హర్యానాలో 22వ ఎయిమ్స్‌.

* అంగన్‌వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు.

*జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.

* ఈఎస్‌ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు.

*143 కోట్ల ఎల్ఈడి బల్పుల పంపిణి.

* గోరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధం.

*కనీస పెన్షన్‌ రూ.3వేలు .

*ప్రధాని గ్రామ సడక్‌ యోజన ద్వారా రోడ్ల నిర్మాణం మూడింతలు పెరుగుదల.

* అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అందించడం.

* దీనివల్ల విద్యాసంస్థల్లో 2లక్షల సీట్లను పెంచడం.

*రైతులకు కనీస మద్దతు ధర 50 % పెంపు .

*చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం కిసాన్‌ పథకం అమలు .

*సైనికులకు ప్రత్యేక అలవెన్స్ లు.

*నెలకు రూ.100 చెల్లిస్తే నెలకు మూడు వేల పెన్షన్‌ పొందే అవకాశం.

* గ్రాట్యూటీ పరిధి 10 లక్షల నుంచి 30 లక్షల పెంపు.

*రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు.

*ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినవారికి రుణాల రీషెడ్యూల్‌.

*సినీ నిర్మాణానికి సింగల్ విండో అనుమతులు.

* 12 % సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గింపు.

*టెలికం రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు.

* ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో వాయిస్,డేటా ప్లాన్స్.

* 2030 నాటికీ భారత్లో విద్యుత్తు వాహనాలు.

*రైల్వేశాఖ అభివృద్ధికి రూ. 64, 587 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు.

*సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో 10 % వృద్ధి.

* బ్యాంకింగ్‌ రంగంలో 4ఆర్‌ ప్రవేశం.

*బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టడం.

* ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం భారత్‌.

*వంట గ్యాస్ కనెక్షన్లు 6 కోట్ల నుండి 8 కోట్లకు పెంపు .

*మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం.

*రెండిళ్లు ఉన్నప్పటికీ అద్దెపై పన్ను మినహాయింపు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top