గ్రామ సచివాలయం పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు సూచనలు

పరీక్షహాల్లోకి సెల్‌ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించేది విజయ్ కుమార్‌ స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తెచ్చుకోవాలని చెప్పారు. మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, దళారీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల 478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, దాదాపు 22 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు కూడళ్లలో, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేయనున్నామని విజయ్ కుమార్‌ తెలిపారు.

అభ్యర్థుల తెలుసుకోవాల్సినవి..


సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు

సెప్టెంబర్‌ 1వ తేదీ ఉదయం పరీక్ష రాయనున్న 12.5 లక్షల మంది

సెప్టెంబర్‌ 1వ తేదీ మధ్యాహ్నం పరీక్ష రాయనున్న 3 లక్షలమంది

ఉదయం 10గంటల నుంచి 12:30 వరకు పరీక్ష

మధ్యాహ్నం 2:30 నుంచి 5గంటల వరకు పరీక్ష

ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

150ప్రశ్నలకు..  150 మార్కులు

పరీక్షల్లో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది

నాలుగు తప్పులకు ఒక మార్కు పోతుంది

రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం

టెక్నికల్‌ పేపర్‌ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది

గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

హాల్‌టికెట్‌, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి

పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు

కూడళ్లు, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు, హెల్ప్‌డెస్క్‌లు

మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటాం

పరీక్షా కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత

MLCLakshamana Rao Garu Study Material

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top