జనాభా లెక్కింపు.. డిజిటల్‌గా...

అన్ని అవసరాలకు ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకొచ్చే యోచనలో ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘ఆధార్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంక్‌ ఖాతా, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ కార్డు.. ఇలా ఈ అవసరాలన్నింటికీ ఒకే గుర్తింపు కార్డు ఉంచుకోవచ్చు.  అది సాధ్యమవుతుంది కూడా’ అని బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు(మల్టీపర్పస్‌ ఐడీ కార్డ్‌) ప్రతిపాదన గురించి అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.

జనాభా లెక్కింపు.. డిజిటల్‌గా

ఈ సందర్భంగా 2021 జనాభా లెక్కింపు గురించి కూడా అమిత్‌ షా ప్రస్తావించారు. ఈ సారి జనగణనను డిజిటల్‌ రూపంలో చేపడతామని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. ‘2021 జనాభా లెక్కింపులో మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తాం. అంతేగాక.. తొలిసారిగా జాతీయ జనాభా రిజిస్టర్‌ను కూడా తయారుచేస్తున్నాం. ఓ వ్యక్తి చనిపోతే ఆ డేటా ఆటోమెటిక్‌గా అప్‌డేట్‌ అయ్యే వ్యవస్థను తీసుకురావాలి’ అని షా చెప్పుకొచ్చారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top