Jio Press Note

ఇప్పటి వరకు జియో యూజర్లు కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ చెల్లించడం లేదు. కేవలం డేటాకు మాత్రమే చెల్లించేవారు. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఐయూసీ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఐయూసీ ఛార్జీలు పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేయబోమని ప్రకటించింది. అదే సమయంలో కాల్స్‌కు వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో తిరిగి వినియోగదారులకు అందివ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం కొన్ని టాపప్‌ వోచర్లను ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని జియో పేర్కొంది.


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) 2017లో ఇంటర్‌ కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలను (ఐయూసీ) నిమిషానికి 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. 2020 జనవరి తర్వాత పూర్తిగా రద్దు చేయాలనుకుంటోంది. గత మూడేళ్లలో జియో ఐయూసీ ఛార్జీల కింద ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా వంటి కంపెనీలకు రూ.13,500 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు తమ సొంత నిధుల నుంచే చెల్లించామని తెలిపింది.

 ఐయుసి టాప్-అప్ వోచర్‌ ఎలా పని చేస్తుంది ?


▪జియో ప్రీపెయిడ్ కస్టమర్లు కొత్తగా ప్రారంభించిన ఐయుసి టాప్-అప్ వోచర్‌లను వారి అవసరాలకు అనుగుణంగా రూ .10, రూ .20, రూ .50, రూ .100 కొనుగోలు చేయాల్సి ఉంటుంది

 ▪టాప్-అప్ వోచర్లు సమానమైన నిమిషాలు మరియు ఉచిత డేటాను కూడా అందిస్తాయి.

 ▪ఉదాహరణకు, రూ .10 వోచర్ 1 జిబి అదనపు డేటాతో పాటు జియోయేతర మొబైల్‌లకు 124 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్‌లను అనుమతిస్తుంది;

 ▪రూ .20 వోచర్ 2 జీబీ డేటాతో 249 నిమిషాలు ఇస్తుంది; రూ .50 వోచర్ 5 జీబీ డేటాతో 656 నిమిషాలు ఇస్తుంది,

 ▪రూ .100 వోచర్ 10 జీబీ డేటాతో 1,362 నిమిషాలు ఇస్తుంది.

▪జియో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు సమానమైన అదనపు డేటాతో, జియోయేతర మొబైల్‌లకు అవుట్‌గోయింగ్ కాల్‌ల కోసం నిమిషానికి 6 పైసలు ఎక్కువ వసూలు చేయబడుతుంది


Jio Press Note
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top