Census 2021 దేశవ్యాప్తంగా 16వ సారి జనగణనకు కేబినెట్ ఆమోదం

జనగణన-2021పై సమీక్ష---ఈ ఏడాది ఏప్రిల్ -సెప్టెంబర్ మధ్య తొలిదశ సర్వే....



జనగణన :: 150 ఇళ్లకు ఒక గణకుడు

★  ప్రతి 120 నుంచి 150 ఇళ్లకు ఒక ‘జనగణన బ్లాక్‌’గా నిర్ణయించి ఒక గణకుడిని కేటాయిస్తారు.

★ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,14,904, తెలంగాణలో 70,064 జనగణన బ్లాకులుంటాయని ప్రాథమిక అంచనా.

★  తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,71,484 మంది ఉపాధ్యాయులను జనగణనకు వినియోగించాలని నిర్ణయించారు.ఆంధ్రప్రదేశ్‌లో 94,835 , తెలంగాణలో 76,649 మంది టీచర్లు జనాభాలెక్కలు సేకరించే క్రతువులో పాల్గొనాల్సిఉంది.

★ ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులకు తొలుత శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు టీచర్లకు శిక్షణ ఇస్తారు.

★ ఏప్రిల్‌ 4వ వారం నుంచి జూన్‌ 10లోగా* తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు, కట్టడాలు, *ఎన్‌పీఆర్‌ నమోదు పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

★ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.
జనగణన :: 150 ఇళ్లకు ఒక గణకుడు

★  ప్రతి 120 నుంచి 150 ఇళ్లకు ఒక ‘జనగణన బ్లాక్‌’గా నిర్ణయించి ఒక గణకుడిని కేటాయిస్తారు.

★ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,14,904, తెలంగాణలో 70,064 జనగణన బ్లాకులుంటాయని ప్రాథమిక అంచనా.

★  తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,71,484 మంది ఉపాధ్యాయులను జనగణనకు వినియోగించాలని నిర్ణయించారు.ఆంధ్రప్రదేశ్‌లో 94,835 , తెలంగాణలో 76,649 మంది టీచర్లు జనాభాలెక్కలు సేకరించే క్రతువులో పాల్గొనాల్సిఉంది.

★ ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులకు తొలుత శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు టీచర్లకు శిక్షణ ఇస్తారు.

★ ఏప్రిల్‌ 4వ వారం నుంచి జూన్‌ 10లోగా* తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు, కట్టడాలు, *ఎన్‌పీఆర్‌ నమోదు పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

★ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.


Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC) 
and updation of NPR in Andhra Pradesh State – *Certain clarification on NPR*
exercise - Orders – Issued.
GENERAL ADMINISTRATION (AR) DEPARTMENT 
G.O.RT.No. 124 Dated: 22-01-2020


 మొబైల్ యాప్ తో జనగణన..

★ ఇందుకోసం పూర్తి స్థాయిలో సాంకేతికత వినియోగం..

★ కుటుంబంలోని వారిని మొత్తం 31 ప్రశ్నలు అడుగుతారు..

★ మరుగుదొడ్లు, టీవీ వివరాలు.. ఫోన్ నెంబర్ చెప్పవలసి ఉంటుంది..

★ 2020 ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం..

NPR లో ఈసారి సేకరించబోయే 21 డేటా పాయింట్లు

1. వ్యక్తి పేరు
2. ఇంటి పెద్దతో బంధుత్వం
3. లింగం
4. పుట్టిన తేదీ
5. వివాహం
6.విద్యార్హతలు
7. వృత్తి
8. తండ్రిపేరు/తల్లి పేరు/దాంపత్య భాగస్వామి
9. పుట్టిన స్థలం
10. ప్రస్తుతం నివాస చిరునామా
11. ప్రస్తుత నివాస చిరునామాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు.
12. జాతీయత
13. శాశ్వాత నివాస చిరునామా

14. ఆధార్ కార్డ్ నెంబర్ (వాలంటరీ)
15. మొబైల్ నెంబర్
16. తల్లిదండ్రులు పుట్టిన తేదీ, పుట్టిన స్థలం
17. చివరగా నివసించిన చిరునామా
18. పాస్ పోర్ట్
19. ఓటర్ ఐడీ కార్డ్ నెంబరు
20. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)
21. డ్రైవింగ్ లైసెన్స్

దేశవ్యాప్తంగా 16వ సారి జనగణనకు కేబినెట్ ఆమోదం..

జాతీయ జనాభా పట్టిక(నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌- ఎన్‌పీఆర్​) కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది

ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2020 వరకు జనాభా లెక్కింపు..జనాభా లెక్కల రిజిస్టర్‌లో వివరాలు నమోదుకు రూ.3,941 కోట్లు..పేపర్ సాయం లేకుండా యాప్ ద్వారా జనాభా లెక్కింపు

వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న జాతీయ జనాభా పట్టికకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది

దేశంలో ఉన్న ప్రతీ పౌరుడి వివరాలను రూపొందించేది జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పిఆర్). ఈ డేటాబేస్‌లో ప్రతి ఒక్కరి వివరాలతో పాటుగా బయోమెట్రిక్స్‌ను కూడా పొందుపరుస్తారు

★ జనగణనపై జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత జిల్లాస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

★ వచ్చే ఏడాది *ఏప్రిల్‌ 20 నుంచి సెప్టెంబర్‌ వరకు* ఇళ్ల గణన చేపడతారు. అనంతరం జనాభా గణన నిర్వహిస్తారు.

★ ప్రతి పదేళ్లకు నిర్వహించే జనాభా గణనకు సంబంధించి రాష్ట్రస్థాయిలో మాస్టర్‌ శిక్షకులుగా జిల్లా నుంచి నలుగురు అధికారులు ఎంపికకాగా, హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటీవల వారం రోజులపాటు శిక్షణ ఇచ్చారు.

★ పెడన ఎమ్యీవో బవిరి శంకర్‌నాథ్‌, మచిలీపట్నం ఎమ్యీవో దుర్గాప్రసాద్‌, విజయవాడ స్టాటిస్టికల్‌ విభాగంలో పని చేస్తున్న రజనీష్‌, తిరుపతిరెడ్డి ఈ శిక్షణ పూర్తి చేశారు.

★ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో అధికారులకు వీరు శిక్షణ ఇవ్వనున్నారు.

★ ఈసారి సాంకేతికతను ఉపయోగించుకుని *ట్యాబ్‌లో యాప్‌ ద్వారా* సమాచారాన్ని నిక్షిప్తం చేయటానికి ప్రాధాన్యత ఇస్తారని ఎమ్యీవో శంకర్‌నాథ్‌ తెలిపారు.

జనగణనకు ప్రత్యేక యాప్‌: 

 కాగితంతోనే కాకుండా మొబైల్‌ ద్వారా కూడా జనగణన-2021 వివరాలు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. 2020 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సచివాలయంలో జనాభా గణన-2021పై సీఎస్‌ నీలం సాహ్ని శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ‘వివరాల నమోదుకు 28 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని రూపొందించాం. బ్యాంకు ఖాతా, వీసా, మొబైల్‌ నంబరు సేకరిస్తాం. నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించాం’ అని తెలిపారు.

జనగణన 45 రోజులు


 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్యలో నిర్వహణ

 ఏర్పాట్లపై సీఎస్‌ జోషి సమీక్ష


 జాతీయ జనాభా గణన–2021 లో భాగంగా వచ్చే ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య 45 రోజులు రాష్ట్రంలో తొలి విడత జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నామని సీఎస్‌ ఎస్‌కే జోషి వెల్లడించారు. 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు రెండో విడత నిర్వహిస్తామని చెప్పారు.

 71,136 మంది ఎన్యూమరేటర్లు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. జనాభా గణన–2021 కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. 65 మంది మాస్టర్‌ ట్రైనర్లకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో తొలి విడత శిక్షణ ముగిసిందని, రెండో విడత సోమవారం నుంచి 7 వరకు జరుగుతుందని చెప్పారు.
జనన గణన ఫార్మాట్
 జనాభా లెక్కల సేకరణలో భాగంగా గృహాల జాబితాల తయారీ, జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్ట్రర్‌ను నవీకరిస్తారని వెల్లడించారు. వ్యక్తుల వివరాలతో పాటు సాంఘిక, సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థికపర వివరాలను సేకరిస్తారని చెప్పారు. ఎన్యూమరేటర్లు తమ మొబైల్‌ ఫోన్‌ యాప్‌తో పాటు కాగితపు దరఖాస్తులను నింపడం ద్వారా జనాభా వివరాలను సేకరిస్తారన్నారు. జనాభా గణన వ్యవహారాల డైరెక్టర్‌ కె.ఇలంబర్తి ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు.

జన గణన ఫార్మాట్

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top