బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు మరింత ఎక్కువ రక్షణ లభించనుంది. బ్యాంకు డిపాజిట్లపై ఇప్పటి వరకు ఉన్న బీమా కవరేజీని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారంనాటి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించడం తెలిసిందే. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో ఫిబ్రవరి 4( మంగళవారం) నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా ఏదైనా కారణం చేత బ్యాంకు మూతపడితే అందులో డిపాజిట్లపై గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) ఈ బీమా కవరేజీని అందిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment