ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules) TUITION FEES REIMBURSEMENT

ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules) TUITION FEES REIMBURSEMENT

◆ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 4 వ తరగతి ఉద్యోగులు మరియు నాన్-గెజిటెడ్ ఉద్యోగులందరికి ఈ సదుపాయం వర్తిస్తుంది.

◆1978 నుండి ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

◆ ఎల్‌కెజి నుండి ఇంటర్మీడియట్ / 12 వ తరగతి చదువుతున్న పిల్లలకు ఇద్దరికి మించకుండా వర్తిస్తుంది.

◆రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో మాత్రమే పిల్లలు చదువుతూ ఉండాలి.

◆ ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజు ఉండదు కాబట్టి ఆయా పాఠశాలలలో చదివే వారికి ఈ వర్తింపు ఉండదు.

◆ట్యూషన్ ఫీస్ రేయింబర్స్మెంట్ చేయమని కోరుతూ DDO కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు తో పాటుగా పాఠశాల నుండి స్టడీ సర్టిఫికెట్, పాఠశాల గుర్తింపు కాపీ,ఫీజు చెల్లింపు రసీదులను జత చేయాలి.

◆ పదవ పే రివిజన్ కమిషన్, 2015,  ట్యూషన్ ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను
 సంవత్సరానికి ఒక్కో పిల్లవాడికి రూ .1000 / - నుండి రూ .2500 / - (రూ. రెండు వేల మరియు ఐదు వందల మాత్రమే) పెంచుతూ ప్రతిపాదన చేసింది

◆ఆంధ్రప్రదేశ్ లో ఈ పెంపు కి సంబంధించి ఉత్తర్వులు వెలువడలేదు. కావున ప్రస్తుతం ఏడాదికి ఒక్కో విద్యార్థికి 1000 రూపాయలు రేయింబర్స్మెంట్ వర్తిస్తోంది.

◆తెలంగాణ రాష్ట్రం 10 వ PRC రికమండేషన్ ప్రకారం ఈ మొత్తాన్ని 2500/-కి పెంచుతూ ఉత్తర్వులు సంఖ్య 27 తేదీ 24.09.2015 విడుదల చేసింది.

◆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ PRC కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ట్యూషన్ ఫీజు రేయింబర్స్మెంట్  ఒక్కో విద్యార్థికి సంవత్సరం కి రూ.27000/-(ఇరవై ఏడు వేల రూపాయలు)ఇద్దరికి మించకుండా వర్తిస్తుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top