పాఠశాల విద్య, గోరుముద్ద నాణ్యతపై సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష ముఖ్యాంశాలు

మంగళవారం పాఠశాల విద్య, గోరుముద్ద నాణ్యతపై సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష ముఖ్యాంశాలు

▪️ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీ-1, పీపీ-2గా ప్రీప్రైమరీ విద్యను అమలు చేయాలని చెప్పారు

▪️ ప్రీ ప్రైమరీ తరగతులకు సిలబస్‌ రూపొందించాలని సూచించారు

▪️పీపీ-1, పీపీ-2 పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలుండాలని సీఎం తెలిపారు

▪️ప్రాథమిక విద్య పరిధిలోకి పీపీ–1, పీపీ–2, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు నియమిస్తారు

▪️ మండలానికి ఒక హైస్కూల్‌ జూనియర్‌ కాలేజీగా మార్పు... చేయనున్నారు

▪️నాడు నేడు కార్యక్రమాల్లో 10వ అంశంగా కిచెన్ షెడ్డు చేర్చి పిసిసి నిర్మాణం చేయాలని సూచించారు

▪️ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని నియమించనున్నారు

▪️జిల్లా స్థాయిలో డీఇవో, జేడీలు ఉంటారు

▪️జిల్లాల్లో జేసీల పరిధిలోకి విద్యాశాఖను తీసుకురానున్నారు

▪️ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే కంప్యూటర్‌ విద్యను అందిస్తారు

▪️ప్రతి జిల్లాలో టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు

▪️వర్చువల్‌ కాస్ల్‌ రూమ్‌, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top