గోరువెచ్చని నీరు తాగడం వల్ల లాభాలు - వేడి పాలు రాత్రిపూట తాగడం వల్ల లాభాలు

గోరువెచ్చని నీరు తాగడం వల్ల లాభాలు:

గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ముక్కు, గొంతులలో ఉండే శ్లేష్మం కరుగుతుంది. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణంతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

* గోరు వెచ్చని నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.

* మలబద్దకం ఉన్నవారు గోరు వెచ్చని నీటిని తాగితే సుఖ విరేచనం అవుతుంది. అలాగే రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

వేడి పాలు రాత్రిపూట తాగడం వల్ల లాభాలు:


* వేడి పాలు రాత్రిపూట తాగడం వల్ల లాభం ఇదే. పరిశోధనల ప్రకారం పాలు తాగటం వల్ల తొందరగా పడుకుంటారు

*పాలు గొంతునొప్పిని కూడా తగ్గించగలవు. గొంతునెప్పి వచ్చినపుడు వేడిపాలను (కొంచెం మిరియాల పౌడర్ తో కలిపి) తాగండి

*అలసటతో బాధపడేవారు వేడి పాలు తాగి హాయిగా హుషారుగా మారచ్చు. పిల్లలకి ప్రత్యేకంగా ఇదే తాగించాలి

*పాలు వినియోగంలో పాలవిరుగుడు ప్రోటీన్ ఉనికి కారణంగా పెద్దప్రేగు వంటి కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది

*కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగాలి

* వేడిపాలు తీసుకోవటం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top