▪️ఒకే పాఠ్యపుస్తకం లో కుడి, ఎడమ పేజీల్లో రెండు మాధ్యమాలు
▪️ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మారిన పాఠ్య పుస్తకాలు
▪️ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంవత్సరం ఒకటో తరగతి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలలో ముద్రణలో గతంలో ఉన్న విధానం కన్నా నూతన విధానాన్ని ఈ విద్యాసంవత్సరం చేపట్టింది వీటి ప్రకారం తెలుగు మరియు ఇంగ్లీష్ కలిసి ఉండే విధంగా పుస్తకాలు ముద్రించడం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించనున్నారు అదే రోజు ఈ నూతన పాఠ్య పుస్తకాలు జగనన్న విద్యా కానుక విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది
లాంగ్వేజ్ కి సంబంధించిన పాఠ్యపుస్తకాలు తెలుగు ఇంగ్లీషు హిందీ పుస్తకాల్లో ఎలాంటి మార్పులు లేవు
గణితము సైన్స్ సోషల్ పాఠ్యపుస్తకాలలో ఒకే పాఠ్యపుస్తకంలో కుడివైపు పేజీలో తెలుగు మీడియం ఉండేవిధంగా ముద్రించారు ఎడమవైపు పేజీలో ఇంగ్లీష్ ఉండేవిధంగా ముద్రించారు ఈ పాఠ్య పుస్తకం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న విద్యార్థులు కూడా ఉపయుక్తంగా ఉంటుంది
0 comments:
Post a Comment