సీబీఎస్ఈ విద్యార్థులకు బోర్డ్ ఊరటనిచ్చే వార్త చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కరోనా ఉధృతి తీవ్రతరం అవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు కూడా కరోనా బారిన పడుతున్నారు. పరీక్షలు జరుగుతున్నందున ఏం చేయాలో తెలీక వారు, ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. పాజిటివ్ అని తేలిన విద్యార్థులు ప్రస్తుతం పరీక్షకు హాజరుకాకపోయినా ఇబ్బందేం లేదని, పరీక్షలు అయిన తర్వాత వారి కోసం మరోసారి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
0 comments:
Post a Comment