★ ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్ పేరును మార్చింది.
ఆ స్థానంలో ఇఎపిసెట్గా మార్చింది.
★ ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
★ పాత ఎంసెట్లో ఉన్న మెడికల్, డెంటల్ అనే పదాలను అందులో నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.
★ గతంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా పిలిచే ప్రవేశపరీక్షను ఇకముందు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా పిలవనున్నట్లు పేర్కొంది.
★ కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ అనే పదాలు ఎక్కడున్నా చట్టం నుండి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
★ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలు చట్టం 1983లోని సెక్షన్-5లో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
0 comments:
Post a Comment