ఏపీలో వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు యాప్

‌ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత టీకా వేసుకున్న వైద్య సిబ్బందికి రెండో డోసు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం జగన్‌ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే ఈ ప్రక్రియ మొత్తాన్ని యాప్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు.

రేపటి నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఈ యాప్‌లో పొందుపర్చనున్నారు.

రిజిస్ట్రేషన్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, పేరు ద్వారా లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు. ఈ నెల 20 నాటికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top