కోవిడ్‌ చికిత్స కోసం రూ.5 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలను పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు (పిఎస్‌బిలు) మంజూరు చేయనున్నాయి

 కష్టకాలంలో ప్రభుత్వ బ్యాంకుల చేయూత

కోవిడ్‌ చికిత్స కోసం రూ.5 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలను పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు (పిఎస్‌బిలు) మంజూరు చేయనున్నాయి. ఎస్‌బిఐ ఈ రుణాలకు చెల్లింపుల కాలవ్యవధిని 5 ఏళ్లు, వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. మిగిలిన బ్యాంకులు తమ వడ్డీ రేటును, కాలవ్యవధిపై తామే నిర్ణయించుకునే అవకాశాన్ని కలిగి ఉన్నాయి. ఖాతాదారులు తమకు, లేదా కుటుంబ సభ్యులకు కోవిడ్‌ చికిత్స కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశాయి. ఈ ప్రకటన ప్రకారం వేతనం, వేతనం లేనివారు, పింఛనుదారులు ఈ రుణాలను రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకూ పొందవచ్చు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top