నాడు నేడు సాఫ్టువేరు తెలంగాణ ప్రభుత్వం వాడుకొనుటకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు

 


ఎపిలో ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ విద్యాశాఖ విజ్ఞప్తి మేరకు ఎపి ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయని, సాఫ్ట్‌వేర్‌ వినియోగించుకునేందుకు నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు సోమవారం నిరభ్యంతర(నో అబ్జెక్షన్‌) ఉత్తర్వులిచ్చారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top