ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు హైకోర్టుకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేశామని కోర్టుకి నివేదించింది. మిగతా వారికి కూడా వ్యాక్సిన్ వేస్తామని, చర్యలు చేపట్టామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సినేషన్ వేసిన తర్వాతే పాఠశాలలు తెరవాలని దాఖలైన పిటీషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్ డాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment