Schools Reopen in AP: ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు పునఃప్రారంభిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నట్టు ఆయన ప్రకటించారు. ఆగస్టులోపు నాడు-నేడు పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని, దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నట్టు మంత్రి సురేష్ చెప్పారు. ఇక.. 30 శాతం పదోతరగతి, 70 శాతం ఇంటర్ ఫస్టియర్ మార్కుల ప్రాతిపదికన..ఇంటర్ విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మెమోలు జారీ చేస్తామని వివరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment