SBI Good News: 342 రూపాయలు చెల్లించండి 400000 రూపాయలు లబ్ధి పొందండి

 రెండు ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ ద్వారా రూ.4,00,000 వరకు బీమా సదుపాయాన్ని SBI (Insurance) అందిస్తోంది. ఇందుకోసం కేవలం రూ.342 చెల్లిస్తే చాలు. 

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు పథకాల ద్వారా కస్టమర్లు రూ.4,00,000 బీమా ప్రయోజనాలు పొందొచ్చు.


 ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY):

ఈ పథకం ద్వారా రూ.2,00,000 ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ఇది యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ. ప్రతీ ఏటా కేవలం రూ.12 ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ పాలసీహోల్డర్ ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 బీమా లభిస్తుంది. ప్రమాదంలో గాయపడి, పూర్తిగా వికలాంగులుగా మారితే రూ.2,00,000 బీమా ద్వారా ఆదుకుంటుంది ప్రభుత్వం. పాక్షికంగా అంగవైకల్యం ఏర్పడితే రూ.1,00,000 వరకు బీమా లభిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY):

 ఈ పాలసీ ద్వారా రూ.2,00,000 బీమా లభిస్తుంది. ప్రతీ ఏటా రూ.330 ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీహోల్డర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 బీమా చెల్లించి ఆర్థికంగా ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇది టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీల ద్వారా జూన్ 1 నుంచి మే 31 వరకు ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పాలసీకి రూ.12, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీకి రూ.330 కలిపి మొత్తం రూ.342 ప్రీమియం చెల్లిస్తే రూ.4,00,000 బీమా లభిస్తుంది. ఈ పాలసీలు తీసుకోవాలనుకునే కస్టమర్లు సమీపంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు ఇవ్వాలి. వారికి ఎస్‌బీఐలో అకౌంట్ ఉండాలి. ఈ పాలసీ తీసుకున్న తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తే పాలసీ కూడా క్యాన్సిల్ అవుతుంది. ప్రతీ ఏటా గడువు లోగా ప్రీమియం చెల్లించడానికి అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోయినా పాలసీ రద్దయ్యే అవకాశం ఉంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top