సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని PRC ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశించారు : బండి శ్రీనివాసరావు..


తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ: బండి శ్రీనివాసరావు..

తెలంగాణా కంటే మెరుగ్గానే పీఆర్సీ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నట్టు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎన్ సమీర్ శర్మ, ఆర్థిక కార్యదర్శి శశిభూషన్ ను కలిసిన అనంతరం మీడియాతో బండి మాట్లాడుతూ, ఉద్యోగుల డిమాండ్లపై కార్యదర్శుల సమావేశం బుధవారం నిర్వహిస్తామని ప్రభుత్వం సమాచారం పంపిందని స్పష్టం చేశారు. ఉద్యోగుల విజ్ఞప్తులకు సంబంధించిన అంశాలపై సమాచారం. ఇచ్చేందుకు సచివాలయంలో ఆర్థిక శాఖ మానవ వనరుల విభాగం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ను కలిశామని వెల్లడించారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో సీఆర్సీ ఆంకాలపై జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో అంశాల వారీగా చర్చిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశించారని అయితే ఆ ప్రకటన రాదని తెలిసి నిరాక చెండామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇస్తున్న 27 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టుగా సజ్జలు తెలిపారు. న్నారు. సీఎం జగన్ ఉద్యోగులకు మంచి చేస్తారనేసం పూర్ణ విశ్వాసం ఉందన్నారు. సీఎం జన్మదినం సంద ర్భంగా పీఆర్సీపై నిర్ణయం ప్రకటిస్తారని ఉద్యోగు లంతా ఎదురు చూశారని జేఏసీ నేత బండి శ్రీనివాసా రావు అన్నారు.

సీఎంతో చర్చలకు పిలవాలి: బొప్పరాజు..

అపోహలకు తావులేకుండా సీఎం వద్ద చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నామని జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగే కార్యదర్శుల సమావేశంలో 71 డిమాండ్లపై చర్చించాలని కోరినట్లు స్పష్టం చేశారు.ఉద్యోగులకు బకాయి పడిన 1600 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. నిలుపుదల చేసిన 3 డీఏ బకాయిలను కూడా తక్షణం విడుదల చేయాల్సిందిగా మరోమారు ప్రభుత్వాన్ని కోరతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యల వల్ల జీతాలు తగ్గుతాయన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉందన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతశివారెడ్డి మాట్లాడారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top