ఉద్యోగుల దరఖాస్తుల పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి : వెంకట్రామిరెడ్డి


ఉద్యోగుల దరఖాస్తుల పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి : వెంకట్రామిరెడ్డి

నూతన పీఆర్సీ కాకుండా పాత విధానంలో జనవరి జీతాలు, పెన్షన్లుచెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగుల దరఖాస్తులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రెజరీ ఉద్యోగులకు ఛార్జ్ మెమో ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి మూడో తేదీ చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే నాలుగవ తేదీ పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులంతా కంప్యూటర్లను షట్ డౌన్ చేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు మంగళవారం నుంచి సచివాలయం వెలుపల దీక్షలు వుంటాయని చెప్పారు.


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top