ఉద్యోగ సంఘాల విలేకరుల సమావేశం Live.....

 ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్‌సీ జీవోలపై

ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ ఐక్యవేదిక నేతలు విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర చరిత్రలో ఇలా జరగలేదు: బండి శ్రీనివాసరావు

''రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ తీసేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పెట్టారు. రాజధాని ప్రాంతంలో పని చేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మాకు కొత్త పీఆర్సీ అవసరం లేదు. ఈ జీవోలు మాకొద్దు. మేం వాటిని తిరస్కరిస్తున్నాం. ఈ పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే ఇవ్వండి. పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ మాకు అవసరం లేదు. పెన్షనర్ల హక్కులు కూడా ఈ ప్రభుత్వం పోగొట్టింది. ఈ విషయంలో సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలి. రేపు, ఎల్లుండి ఉద్యోగ కమిటీ సమావేశాలు నిర్వహిస్తాం. అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతాం. అవసరమైతే సమ్మె కు కూడా సిద్ధంగా ఉన్నాం. పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చే వరకు పోరాడుతాం'' అని పేర్కొన్నారు.

డీఏలు అడ్డుపెట్టుకొని పీఆర్సీ ఇచ్చారు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

''ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ప్రేమ లేదు. డీఏలు అడ్డుపెట్టుకొని పీఆర్సీ ఇచ్చారు. మాకు ఈ పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలు మాకొద్దు. ఇప్పటివరకు ప్రభుత్వంతో అనేక రకాల చర్చలు జరిపాం. కానీ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా జీవోలు తీసుకొచ్చింది.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏకతాటిపైకి వచ్చి ప్రకటించే కార్యాచరణ అమలు చేయాలి. సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం'' అని తెలిపారు.

20 అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టింది: జోసెఫ్‌ సుధీర్‌బాబు

''ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇదొక చీకటి రోజు. మేము ప్రతిపాదించిన 20 అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. రివర్స్‌ టెండరింగ్‌ తరహాలో రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. మాకు నష్టం కలిగే పీఆర్సీ వద్దు. కనీసం పాత మధ్యంతర భృతి కొనసాగించడండి. మేం నమ్మిన ప్రభుత్వమే మమ్మల్ని మోసం చేసింది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. జీవోలు వెనక్కి తీసుకోకపోతే ఎంతవరకైనా వెళ్తాం'' అని ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు తెలిపారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top