పీఆర్సీ జీవో అంశాలు.. తాజా మార్పులు ఇలా..

పీఆర్సీ జీవో అంశాలు.. తాజా మార్పులు ఇలా..


గత నెలలో పీఆర్సీ జీఓ ప్రకారం..

► 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు.. 

► 50 లక్షల జనాభా దాటితే : 24 శాతం

► 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే : 16 శాతం (సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇది వర్తింపు)

► 5 లక్షల జనాభా వరకు : 8 శాతం పెన్షనర్ల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ (కేంద్ర వేతన సవరణ ఆధారంగా..)

► 80 ఏళ్లు దాటిన వారికి : 20 శాతం

► 85 ఏళ్లు దాటితే : 30 శాతం

► 90 ఏళ్లు దాటితే : 40 శాతం

► 95 ఏళ్లు దాటితే : 50 శాతం

► 100 ఏళ్లు దాటితే : 100 శాతం

► సవరించిన పే స్కేల్స్‌ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి గ్రాట్యుటీ చెల్లింపు

► 2019 జూలై నుంచి 2021 డిసెంబర్‌ వరకు చెల్లించిన మధ్యంతర భృతిని డీఏ బకాయిల నుంచి సర్దుబాటు

► వేతన సవరణ కాల పరిమితి కేంద్ర వేతన సవరణ కమిషన్‌ ప్రకారం వర్తింపు 

► కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు.. ఉద్యోగాల క్రమబద్ధీకరణకు చర్యలు 

► ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు

► కార్యదర్శుల కమిటీ సిఫారసుల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీసీఏ అవసరంలేదని భావించి ఉపసంహరణ

► సీసీఏ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని నిర్ణయం

► మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌పై త్వరితగన నిర్ణయం

► ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు 

► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను 2022 జూన్‌ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు 



*తాజా చర్చల్లో ప్రభుత్వం ఆమోదించిన అంశాలు..*



► గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కొనసాగింపు

మారిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు

► 50 వేలలోపు జనాభా ఉంటే : 10 శాతం, రూ.11 వేలు సీలింగ్‌

► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే : 12 శాతం, రూ.13 వేలు సీలింగ్‌ 

► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా : 16 శాతం, రూ.17 వేలు సీలింగ్‌ (13 జిల్లా కేంద్రాలకు ఇదే శ్లాబు వర్తింపు)

► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే 24 శాతం, రూ.25 వేల సీలింగ్‌

► సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ (2022 జూలై నుంచి 2024 జూన్‌ వరకు)


రిటైర్డ్‌ ఉద్యోగుల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌..

► 70–74 ఏళ్ల వయసు వారికి : 7 శాతం

► 75–79 ఏళ్ల వయసు వారికి : 12 శాతం

► గ్రాట్యుటీ గతంలోలా కాకుండా 2022 జనవరి నుంచి అమలు

► 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు (9 నెలలు) ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని సర్దుబాటు చేయరు.

► వేతన సవరణ పరిమితి ఐదేళ్లు. కేంద్ర వేతన సవరణ కమిషన్‌ను రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయరు. 

► ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు

► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు 

► మారిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఈ ఏడాది జనవరి నుంచి అమలు. 

► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల.

► సీపీఎస్‌ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు. 2022 మార్చికల్లా దీనిపై రోడ్‌ మ్యాప్‌ రూపకల్పన

► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల అంశం దీనిలోనే పరిశీలన

► మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల

► ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు 

► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ 2022 జూన్‌ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు 

► పీఆర్సీ నివేదిక విడుదల అంశం పరిశీలిస్తాం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top