ఈనెల 31న కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం?

 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల మార్పుపై పార్టీనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు స్వీకరించారు. అభ్యంతరాలను పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈనెల 31న కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top