✩ రాష్ట్రం లో వేసవి ఎండలను పరిగణలోకి తీసుకొని గతంలో వలే ఈ నెల 15వ తేదీ నుండి ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
✩ వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఏడాది మార్చి 15 నుండి ఒంటిపూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చేవారన్నారు.
✩ తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ నెల 16వ తేదీ నుండి ఒంటిపూట బడులు మొదలవు తున్న విషయాన్ని గుర్తు చేశారు.
✩ ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు.
0 comments:
Post a Comment