ఏపీలో పాఠశాలలకు ఈనెల 4 నుంచి ఒంటిపూట తరగతులు

 


ఏపీలో పాఠశాలలకు ఈనెల 4 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి 11. 30 గంటల వరకు తరగతులు

నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒంటిపూట బడులపై ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.

గౌరవ మంత్రివర్యులు గారి ఫేస్బుక్ పేజీ నందు ఒంటిపూట బడులు గురించి వార్త


Note:ఫేస్బుక్ లో వెల్లడించిన విద్యా శాఖా మంత్రి ఆది మూలపు సురేష్.  ఉత్తర్వులు త్వరలో వచ్చే అవకాశం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top