2024 తర్వాత జన గణనను ప్రత్యేకించి చేపట్టాల్సిన అవసరం లేదు : అమిత్ షా

 దేశంలో పదేళ్లకోసారి నిర్వహించే జన గణన 2024 తర్వాత ఉండదట. 2024 తర్వాత జన గణనను ప్రత్యేకించి చేపట్టాల్సిన అవసరం లేదని అన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాఅస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. జనన, మరణ రిజిస్టర్ల రేటును జన గణనకు జత చేస్తామని, 2024లోగా ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాటును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

ఆ తర్వాత దేశంలో నమోదయ్యే జననాలతో పాటు మరణాలు కూడా ఆటోమేటిక్‌గా జన గణనకు జత అవుతుంటాయని తెలిపారు. అంతేకాకుండా ఆయా వ్యక్తుల వయసు 18 నిండగానే.. వారి పేర్లు ఆటోమేటిక్‌గా ఓటర్ల జాబితాలో చేరిపోతాయని కూడా ఆయన చెప్పారు. తాజాగా చేపట్టనున్న జన గణనలో ఈ తరహా మార్పులన్నీచేస్తున్నామని చెప్పిన అమిత్ షా. ఈ-సెన్సస్(E-Census)లో అందరికంటే ముందు తన కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకుంటానని ప్రకటించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top