ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటివరకు నిషేధం కొనసాగుతూ వచ్చింది. నిషేధాన్ని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డంకులు తొలిగిపోయినట్లు అయింది. దీంతో జూన్ 17 లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Subscribe to:
Post Comments (Atom)


.jpeg)
Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment