ఆగస్టు 1 నుంచి టీచర్లకు ఆన్‌లైన్‌ హాజరు



రెండేళ్లుగా కొవిడ్‌ నేపథ్యంలో దూరమైన ఆన్‌లైన్‌ హాజరు విధానాన్ని పాఠశాల విద్యాశాఖ పునరుద్ధరిస్తోంది. ఆగస్టు 1 నుంచి ఉపాధ్యాయులంతా వారి సొంత ఫోన్లలోనే ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ విధానంలో హాజరును నమోదుచేయాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ రూపొందించినట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన వెబ్‌ఎక్స్‌  సమావేశంలో స్పష్టంచేశారు. అలాగే చైల్డ్‌ ఇన్ఫో నమోదు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఉదయం 10.30గంటలలోపు ఏ ఒక్క విద్యార్థికి హాజరు వేయకపోయినా హెచ్‌ఎంతోపాటు, ఎంఈవో, డీఈవోలకు షోకాజ్‌ నోటీసులు వస్తాయని స్పష్టంచేశారు. 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top