బీఈడీ కోర్సుల ప్రారంభానికి ఐఐటీల దరఖాస్తు

బీఈడీ కోర్సుల ప్రారంభానికి దేశం లోని వివిధ ఐఐటీలు దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ఆయన సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధా నంగా చెప్పారు. జాతీయ విద్యా విధానంలో చెప్పినట్లుగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహణ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీ టీఈ) ఈ ఏడాది మేలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా సంస్థలు, యూనివర్సిటీల నుంచి దరఖాస్తులు ఆహ్వా నించినట్లు పేర్కొన్నారు. అందుకోసం ఖరగప్పుర్, మద్రాస్, గువాహటి, భువనేశ్వర్ ఐఐటీలు దరఖాస్తు చేశాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top