10+2 ఫార్మాట్‌కు సీబీఎస్‌ఈ ముగింపు

 జాతీయ విద్యా విధానంలో సిఫారసులకు అనుగుణంగా సీబీఎ్‌సఈ కీలక మార్పులు చేయనుంది.ప్రస్తుతమున్న 10+2 ఫార్మాట్‌కు ముగింపు పలికి, దాని స్థానంలో 5+3+3+4 విధానాన్ని తీసుకురానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫార్మాట్‌ను ప్రకటించనున్నట్టు సీబీఎ్‌సఈ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సీబీఎ్‌సఈకి అనుబంధంగా ఉన్న పాఠశాలలు కొత్త విధానంలోకి మళ్లేందుకు అవసరమైన మార్పులు చేసుకోవాలని, దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. స్కూల్‌, టీచర్‌, స్టూడెంట్‌ రిజిస్ట్రీలను ప్రారంభించనున్నట్టు సీబీఎ్‌సఈ చైర్‌పర్సన్‌ నిధి చిబ్బర్‌ తెలిపారు.


పిల్లల విద్య నాలుగు దశల్లో ఉండాలని జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంది. ప్రారంభ దశ ఐదేళ్లు, తర్వాతి రెండు దశలు మూడేళ్ల చొప్పున, నాలుగోదైన మాధ్యమిక దశ నాలుగేళ్లు ఉండాలని సిఫారసు చేసింది. ఈ విభజన పిల్లల్లో మేధావికాసానికి అనుగుణంగా సూచించినట్టు తెలిపింది. ఈ మేరకు కొత్త వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానానికి సీబీఎస్‌ఈ శ్రీకారం చుట్టనుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top