ఏపీలో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించాలి.. ప్రభుత్వ నిర్ణయం

 


ఎలక్ట్రిక్ వాహనం అనేది ప్రొపల్షన్ కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించే వాహనంఇది కలెక్టర్ సిస్టమ్ ద్వారా ఆధారితం , ఎక్స్‌ట్రావెహిక్యులర్ మూలాల నుండి వచ్చే విద్యుత్తుతో లేదా బ్యాటరీ ద్వారా స్వయంప్రతిపత్తితో శక్తిని పొందుతుంది. కొన్ని సౌర శక్తి ద్వారా కూడా ఛార్జ్ చేయబడుతాయి అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎలక్ట్రిక్ బైక్‌లపై కార్యాలయాలకు రానున్నారు. ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా ఓలా, ఆథర్, హీరో, బిగాస్, కైనెటిక్, టీవీఎస్ వంటి 17 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్‌సీ) వంటివి వాహనాల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తాయి. 

ఉద్యోగులకు ఏడాదిలో కనీసం లక్ష వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) తెలిపింది. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లోని అధికారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్‌ను నెడ్‌క్యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వాహనాలను కోరుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top