మనీ: పిల్లల బంగారు భవిష్యత్తుకు అద్భుతమైన పథకాలు ఇవే..!

 తల్లిదండ్రులైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉంటారు. వారి భవిష్యత్తుకు చక్కటి బాటలు వేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే మీ పిల్లల భవిష్యత్తును బంగారు మయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పోస్ట్ ఆఫీస్ లు కూడా ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి.మరి పిల్లల భవిష్యత్తు బంగారమయం కావాలి అంటే ఎటువంటి పథకాలలో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు పథకాలను తీసుకొచ్చింది. ఒకటి ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్, ఇంకొకటి ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ చాంప్ అనే రెండు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ముందుగా ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ చాంప్ పథకం విషయానికి వస్తే నెలవారి ,త్రైమాసికం , అర్ధవార్షికం , వార్షికం లో పెట్టుబడిగా పెట్టవచ్చు. 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా సరే ఈ పథకాన్ని కొలుగోలు చేయవచ్చు. అయితే పిల్లల వయసు పుట్టినప్పటినుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పాలసీ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు. బిడ్డకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొత్తాన్ని నాలుగు వార్షిక వాయిదాల్లో తీసుకోవచ్చు. ప్రతి ఏటా 25 శాతం చొప్పున తీసుకోవచ్చు.ఈ పథకం ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకోవడంతోపాటు బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది . అనుకోనిది ఏదైనా జరిగితే ఈ ప్లాన్ కింద హామీ మొత్తంలో 100% వరకు బీమా పొందవచ్చు.ఎస్బిఐ స్మార్ట్ స్కాలర్ విషయానికి వస్తే పుట్టినప్పటినుంచి 17 సంవత్సరాల మధ్య పిల్లల వయసు వుండాలి. ఈ పాలసీ 18 నుంచి 25 సంవత్సరాల మెర్క్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ పాలసీలో చేరిన వారు అత్యవసర పరిస్థితిలో డబ్బులు సొంతం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ రెండు పథకాలు కూడా పిల్లల భవిష్యత్తుకు చక్కటి ఆదాయాన్ని అందిస్తాయని చెప్పవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top