Budget 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ ముఖ్యాంశాలు

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 



న్యూఢిల్లీ: ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్‌ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5  లక్షలనుంచి  7  లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు.  కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు  నిర్మలా సీతారామన్ ప్రకటించారు.. ఇది పన్ను చెల్లింపుదారులకు , మధ్య తరగతి వారికి ఊరట కల్పించేలా కొత్త ట్యాక్స్‌ విధానంలో అయిదు మేజర్‌ పథకాలను తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. 

ట్యాక్స్‌ స్లాబ్ల్స్‌ 6 నుంచి 5 కి తగ్గింపు

రూ. 0. 3లక్షలకు   ఎలాంటి  పన్ను లేదు

రూ. 3-6 లక్షల ఆదాయంపై  5 శాతం పన్ను

రూ. 12-15 లక్షల  ఆదాయంపై   20 శాతం

రూ. 15 లక్షలు దాటితే   30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

దీని ప్రకారం ఆదాయం రూ. 7లక్షలు దాటితే 3 లక్షల ఆదాయంనుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలుగా  ట్యాక్స్‌ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. 


♦ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు

♦ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు.

♦ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం. 

♦అధ్యాపకుల శిక్షణకు డిజిటల్‌ విద్యావిధానం, జాతీయ డిజిటల్‌ లైబ్రరీ తీసుకొస్తాం 

♦దేశవ్యాప్తంగా మెడికల్‌ కళాశాలలతో పాటు, 157 నర్సింగ్‌ కాలేజ్‌లకు అనుమతి 

♦త్వరలోనే ఐసీఎంఆర్‌ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం.

♦ ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం.

♦ఈ-కోర్టులకు రూ.7వేల కోట్లు 

♦బ్యాటరీల నిల్వ కేంద్రాల్లో 4వేల మెగావాట్లు.

♦పట్టణ మౌలిక సౌకర్యాలకు రూ.10వేల కోట్ల నిధి.

♦2030 కల్లా 5 MMT హైడ్రోజన్‌ తయారీ.

♦తాజా బడ్జెట్‌లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు చేస్తున్నాం

♦రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.2.40లక్షల కోట్లు కేటాయిస్తున్నాం.

♦రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు

♦రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు.

♦కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75వేల కోట్లు.

♦బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.13.5లక్షల కోట్ల కేటాయింపు.

♦కోస్టల్‌ షిప్పింగ్‌కు ప్రోత్సాహం 

♦కాలుష్య కారక వాహనాల తొలగింపులో భాగంగా వాహన తుక్కు విధానం.

♦పీఎం కౌశల్‌ యోజనలో భాగంగా యువతకు శిక్షణ.

♦ప్రకృతి వ్యవసాయం చేసేందుకు వీలుగా కోటిమంది రైతులకు సాయం.

♦36 అంతర్జాతీయ స్థాయి నైపుణ్య కేంద్రాల ఏర్పాటు

♦కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం. 

♦అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి 33శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నాం

♦ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

♦ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం. 

♦ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు.

♦ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతాము 

♦డిజిటల్‌ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తాం.

♦కారాగాగాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక చేయూత అందిస్తాం

♦దేశంలో 50 టూరిస్ట్‌ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

♦దేఖో ఆప్నా దేఖ్‌ పథకం ప్రారంభం

♦స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్‌

♦దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్‌ల నిర్మాణం 

♦5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు

♦పీఎం కౌశల్‌ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top