NMMS Scholarship Notification

2023 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. డిసెంబర్ 3న రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించబడును. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆదర్శపాఠశాలల్లో ఈ సంవత్సరం 8 వ తరగతి చదువుచూ కుటుంబ ఆదాయం రూ.3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు అర్హులు. పరీక్ష రుసుము జనరల్, బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి., యస్.టి విద్యార్థులకు రూ.50/- ఆన్లైన్ దరఖాస్తులు 10-08-2023 నుండి దరఖాస్తులు అందుబాటులో ఉండును. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 15-09-2013 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరితేదీ 16-09-2023. ప్రింటెడ్ నామినల్ రోల్స్ మరియు ధృవ పత్రములు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరితేదీ 19-09-2023. పూర్తి వివరముల ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్సైటు www.bse.ap.gov.in నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top