NABARD Jobs: నాబార్డులో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.89,150 వరకు జీతం

ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు)' దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.



ఖాళీల వివరాలు..

* అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఎ) పోస్టులు

ఖాళీల సంఖ్య: 150.

డిపార్ట్‌మెంట్: రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్.

పోస్టుల కేటాయింపు: యూఆర్‌-61, ఎస్సీ-22, ఎస్టీ-12, ఓబీసీ-41, ఈడబ్ల్యూఎస్‌-14.

విభాగాలు: జనరల్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, మాస్ కమ్యూనికేషన్/ మీడియా స్పెషలిస్ట్.

అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో జనరల్‌ డిగ్రీ, సంబంధింత విబాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్‌, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.09.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం: నెలకు రూ.44,500 నుంచి రూ.89,150.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.09.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023.

* ఫేజ్-1 (ప్రిలిమినరీ)- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 16.10.2023.

Online Application

Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top