Teacher Recruitment in Andhra Pradesh : ఏపీ నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ఎనిమిది వేలకు పైగా టీచర్ పోస్టులను (Teacher posts) భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామనీ.. మెరుగైన విద్యాను రాష్ట్రంలో అందిస్తున్నామని వెల్లడించారు. అయితే మంత్రి బొత్స ప్రకటనపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ఆంధ్రప్రదేశ్ లో 40,000కు పైగా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారన్నారు. అయితే.. మంత్రి బొత్స మాత్రం 8 వేల టీచర్ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారనీ.. ఇది సరికాదని అన్నారు. మెగా డీఎస్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment