ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ప్రవేశానికి సంబంధించి మొదటి దపా(ఫేజ్-1) ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల జాబితా (జనరల్ కౌన్సెలింగ్) గురువారం(జులై 11న) విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 53,863 మంది దరఖాస్తు చేశారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నూజివీడులో జులై 22, 23 తేదీల్లో, ఇడుపులపాయలో జులై 22, 23 తేదీల్లో, ఒంగోలులో జులై 24, 25 తేదీల్లో; శ్రీకాకుళంలో జులై 26, 27 తేదీల్లో ఉంటుంది. కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి ఉంటుంది. మరికాసేపట్లో ఎంపికైన అభ్యర్థుల పూర్తి జాబితా వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది.
ఎంపిక కాబడిన 20 మంది మెరిట్ అభ్యర్థులు వివరాలు
0 comments:
Post a Comment