NMMS Application Date Extended to 3.10.24

 08-12-2024 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in  05-08-2024 నుండి. పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీని 03-10-2024 వరకు పొడిగించడమైనది. ప్రింటెడ్ నామినల్ రోల్ మరియు ఒరిజినల్ SBI కలెక్ట్ రశీదును సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరి తేదీ 14-10-2024. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ. 3,50,000/- లోపు ఉన్న విద్యార్ధులు అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగానే విద్యార్థి పేరు నమోదు చేయవలెను. దరఖాస్తు చేసుకొనుటకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదు గాని పరీక్ష వ్రాసే సమయమునకు అన్ని ధృవపత్రాలు సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము ఓ.సీ, బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ. 50/- పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని తెలుసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top