విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష


★ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహణ.

★ ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడంపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశం.

★ తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయం.

★ టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, నీళ్లు, ఫర్నిచర్, పెయింటింగ్స్, తరగతి గదులకు మరమ్మతులు, బ్లాక్‌బోర్డ్స్‌ కార్యక్రమాలతో పాటు అదనపు తరగతి గదులను నిర్మించాలని అధికారులను ఆదేశం.

★ రాష్ట్రంలోని 98 శాతం అంటే సుమారు 42,655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీసిన విద్యాశాఖ దాదాపు 10.88 లక్షల ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

★ అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ప్రజలముందు ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచన.

★ కొన్నిచోట్ల అన్ని తరగతులకూ ఒకే టీచర్‌ ఉన్నారన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

★ ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్‌ ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం జగన్‌ నిర్ణయం.

★ ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్‌ సిద్ధం చేయాలని అధికారులనకు ఆదేశం.

     
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top