గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాల తో టెలీ కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు

 గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాల తో టెలీ కాన్ఫరెన్స్..

 ★ కరోనా వ్యాధి విపత్తును నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పట్టణాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సహకరించవలసిందిగా కోరారు.
★ 50 సంవత్సరాలు దాటిన మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈ డ్యూటీల నుంచి మినహాయింపు ఇస్తామని తెలిపారు.
★ అలాగే 50 సంవత్సరాలు లోపు ఉన్న వారు నేటి అవసరాల రీత్యా  ఈ డ్యూటీ లో పూర్తిగా అందరూ పాల్గొనాలని కోరారు.
★ పిహెచ్ సి ,బ్లైండ్, దీర్ఘకాలిక అనారోగ్యం, గర్భిణీ స్త్రీలు, ఫీడింగ్ మదర్స్ కు   మినహాయింపు ఇస్తామని తెలియజేశారు.
★ మున్సిపల్ ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉన్నారో అదే మున్సిపాలిటీలో డ్యూటీలు చేయుటకు అక్కడ మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్ చేయవచ్చని తెలిపారు.
★ ఈ డ్యూటీలో ఉన్న వారికి పోలీసు పర్మిషన్ కోసం ప్రత్యేకమైన పాసు అలాగే మాస్కులు రక్షణ పరికరములు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
★ డ్యూటీ ఉదయం/ సాయంత్రం గాని ఏదో ఒక పూట మాత్రమే ఉంటుంది.
★ కరోనా వైరస్ ప్రమాదం ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమంలో  50 సంవత్సరాలు దాటిన  ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛందంగా వస్తే
డ్యూటీ లో నియమిస్తారు.


గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు వారి టెలికాన్ఫరెన్స్ వాయిస్ నోట్
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top