PD Account ప్రారంభించిన పాఠశాలకు పాఠశాలలు నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ


పాఠశాలలకు నేరుగా నిధులు జమ

★ జిల్లాలో ఇప్పటి వరకు పీడీ ఖాతాల్లేక నిధులు జమ కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రధానోపాధ్యాయులకు కాస్త ఊరట లభించింది. పీడీ ఖాతాలు లేకుంటే పాఠశాలలకు నేరుగా జమ చేయాలని రాష్ట్ర ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

★ జిల్లాలో మొత్తం 241 పాఠశాలలకు నేరుగా నిధులు జమ కానున్నాయి. జిల్లాలోని 3,800 పాఠశాలలకు పాఠశాల నిర్వహణ నిధులు జమ చేయాల్సి ఉంది. ఇందులో 108 పాఠశాలలకు ఇప్పటి వరకు పాఠశాల నిర్వహణ నిధులు జమ చేయలేక పోయారు.

★ ఆ నిధులను జిల్లా ప్రాజెక్టు ఛైర్మన్‌ ఖాతాలో జమ చేసి అనంతరం కలెక్టరు ఆమోదంతో ఆయా పాఠశాలల ఖాతాలకు నిధులు జమ చేస్తారు. మొత్తం రూ.33 లక్షలు జమ చేయాల్సి ఉంది.

★ ఇప్పటి వరకు 483 పాఠశాలలకు మాత్రమే పీడీ ఖాతాలు ఉండటంతో ఆ మేరకు జమ చేశారు. పీడీ ఖాతాల్లేని మరో 133 పాఠశాలలకు జిల్లా ప్రాజెక్టు ఖాతా నుంచి రూ.40 లక్షలు పాఠశాలలకు జమ చేస్తారు.
 ఈప్రక్రియ కొంత వేగంగా పూర్తి కావొచ్ఛు.

         
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top