UGC Experts Committee recommonds Start of New Academic Year by September -2020 due to Covid 19

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతబడినవి

చాలా రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు ఇంకా నిర్వహించలేదు మరియు వివిధ రకాల ఎంట్రన్స్ టెస్ట్ లు కూడా వాయిదా వేసి ఉన్నారు

ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్‌ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.

శుక్రవారం ఇవి తమతమ నివేదికలను సమర్పించాయి.
పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు..


▪️ఏటా జులైలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరాన్ని ఈసారి సెప్టెంబరుకు జరపాలని హరియాణా యూనివర్సిటీ వీసీ ఆర్‌సీ కుహాడ్‌ నేతృత్వంలోని మొదటి కమిటీ సూచించింది.

▪️ఇగ్నో వీసీ నాగేశ్వరరావు సారథ్యంలోని రెండో కమిటీ.. ‘సరైన వసతులు ఉంటే విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలి. లేని పక్షంలో లాక్‌డౌన్‌ ముగిశాకే పరీక్షలు పెట్టాల’ని తెలిపింది.

▪️మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్డీ) మంత్రిత్వశాఖ ప్రస్తుతం ఈ రెండు నివేదికలను పరిశీలిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని హెచ్‌ఆర్డీ ఉన్నతాధికారులు వెల్లడించారు

ఆన్లైన్ పరీక్ష నిర్వహణ నిమిత్తం కీలక సూచనలు:


మౌలిక సదుపాయాలు కలిగిన వర్సిటీల కోసం పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చు
సిఫారసులలో భాగంగా, సెమిస్టర్ మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడానికి మౌలిక సదుపాయాలు కలిగిన కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలను లాక్డౌన్ వ్యవధిలో అనుమతించవచ్చని కమిటీలు సూచించాయి. ఇతరుల కోసం, లాక్డౌన్ ముగిసే వరకు వేచి ఉండాలని కమిటీ సూచించింది మరియు తరువాత పరీక్షలను పెన్-అండ్-పేపర్ బేస్డ్ మోడ్‌లో నిర్వహించండి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top