జీతాల సమాచారం

జీతాల సమాచారం

★ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులకు జూన్‌ నెల జీతాలు, పింఛన్లు ఇంకా అందలేదు.

★ సోమవారం అందుతాయని ఆశించినా ఖాతాలకు ఇంకా సొమ్ములు జమ కాకపోవడంతో సమాచారం కోసం ఆరా తీస్తున్నారు.

★ గురువారం రాత్రికే బడ్జెట్‌కు గవర్నరు ఆమోదముద్ర పడి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇతరత్రా కార్యకలాపాలను పూర్తి చేసుకుని సోమవారం నాటికి జీతాలు అందిస్తారని ఉద్యోగులు ఎదురుచూశారు.

★ సోమవారం మధ్యాహ్నానికీ జీతాలు, పింఛన్ల బిల్లులు రిజర్వు బ్యాంకు ఈ-కుబేర్‌కు చేరలేదు. ఆయా శాఖల బడ్జెట్‌ను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

★ రాష్ట్రంలో 183 మంది విభాగాధిపతులు, వారి ఆధ్వర్యంలో 27వేల మంది డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌ అధికారులు ఉన్నారని,

★ ఆయా ఖాతాలకు బడ్జెట్‌ అప్‌లోడ్‌ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక కారణాలవల్లే ఆలస్యమవుతోందంటున్నారు.

★ వీలైనంత త్వరగా ఈ-కుబేర్‌కు పంపే ఏర్పాట్లలో ఉన్నామని, మంగళవారం సాయంత్రానికి జీతాలు, పింఛన్లు అందుతాయని ఖజానాశాఖ సంచాలకుడు హన్మంతరావు చెప్పారు.

           
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top