ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.....
కరోనా కారణంగా ఉద్యోగులకు కోత పెట్టిన వేతనాలను డిసెంబర్, జనవరి నెలల్లో చెల్లింపులు చేయనున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.
ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
కోత విధించిన వేతనాలకు రూ.2,324 కోట్లు, పింఛనుదారులకు రూ.482 కోట్ల చెల్లింపులు చేస్తామన్నారు
కరువు భత్యం
3.144 శాతం డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో 2, 3 డీఏలు చెల్లిస్తారు
పెన్షనర్లు, ఉద్యోగుల డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం
పెన్షనర్లకు 3.144 శాతం పెంపు, జులై 2018 నుంచి వర్తింపు, జనవరి –2021 నుంచి చెల్లింపు
జనవరి, 2019 నుంచి మరో 3.144శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జులై నుంచి చెల్లింపు
జులై 2019 నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జవరి 2022 నుంచి చెల్లింపు
ఉద్యోగులకు జులై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు
జనవరి, 2019 నుంచి 3.144శాతం పెంచిన డీఏను జులై 2021 నుంచి చెల్లింపు
జులై 2019 నుంచి పెంచిన 5.24శాతం డీఏను జనవరి 2022 నుంచి చెల్లింపు
From
N Chandra Sekhar Reddy
President
APNGOs Association.
0 comments:
Post a Comment