ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆలోచన చేస్తున్నాం - SEC

★ కొవిడ్‌ కారణంగా ఏపీలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈరోజు ప్రకటన విడుదల చేశారు. 


ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ఇది సాధ్యం అయింది అన్నారు

★ కొవిడ్‌ పరిస్థితుల తర్వాత పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని.. 

★ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

★ ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. రాజ్యాంగ పరమైన అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుందని ఎస్‌ఈసీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని రమేష్ కుమార్ పేర్కొన్నారు.

 తెలంగాణలో జీహెచ్‍ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top