మే 15 నుంచి 1నుండి 9 తరగతులకు వేసవి సెలవులు



ఆంద్రప్రదేశ్ లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మే 15 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. ఏప్రిల్‌ 30 వరకు సిలబస్‌ పూర్తి, సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌సఏ) కోసం ప్రిపరేషన్‌, మే 1-10 తేదీల్లో సమ్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్‌లోడింగ్‌, ప్రమోషన్‌ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 30 వరకు సిలబస్‌ పూర్తి, మే 1 నుంచి 16 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌, మే 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు, మే 25 నుంచి జూన్‌ 6 వరకు ఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌, జూన్‌ 7 నుంచి 16 వరకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు.ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీన్ని బట్టి టెన్త్‌ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేనట్టు స్పష్టమవుతోంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top