రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు

 ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్రన్ రైల్వేలో ఖాళీగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3591 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పదో తరగతి, ఇంటర్‌తోపాటు ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులని తెలిపింది. డిప్లొమా చేసిన వారు అప్లయ్‌ చేసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ అందించనున్నారు.

మొత్తం పోస్టులు: 3591

అర్హత: పదో తరగతి, ఇంటర్ తర్వాత ఐటీఐ పూరిచేసినవారు.

అభ్యర్థులు 2021, జూన్ 24 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులు ప్రారంభం: మే 25

దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24

వెబ్‌సైట్‌: http://www.rrc-wr.com

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top