ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు


✳️ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న హైకోర్టు


❇️సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదన్న హైకోర్టు


✳️సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదన్న హైకోర్టు


❇️పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదన్న హైకోర్టు

ఇదీ జరిగింది…..

పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎలక్షన్ కోడ్‌ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి .. ఏప్రిల్ 8 న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6 వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఎస్.ఈ.సీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి..లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్‌ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైనా సింగిల్ జడ్జి ఈనెల 4 న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. తాజాగా న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఎన్నికలు రద్దు చేస్తూ.. తీర్పు వెలువరించారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top