TS PRC New: ఈ నెల నుంచే వేతనాల పెంపు

ఈ నెల నుంచే వేతనాల పెంపు


*30 శాతం ఫిట్‌మెంట్‌కు మంత్రిమండలి ఆమోదం


ఇంటి అద్దెభత్యం పరిమితి తొలగింపు


తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీరితో పాటు ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులందరికీ కలిపి మొత్తం 9,21,037 మందికి 30 శాతం ఫిట్‌మెంట్‌ (వేతనాల పెంపు) ఇవ్వాలని గత మార్చిలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పెంచిన వేతనాన్ని జూన్‌ నెల నుంచి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్‌ బెనిఫిట్‌ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 1.4.2020 నుంచి, క్యాష్‌ బెనిఫిట్‌ను 1.4.2021 నుంచి అమలు చేసేందుకు అనుమతించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. పింఛనుదారులకు 1-4-2020 నుంచి 31-5-2021 వరకు చెల్లించాల్సిన బకాయి(ఎరియర్స్‌)లను 36 వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగినులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇంటి అద్దెభత్యం (హెచ్‌ఆర్‌ఏ) మీద పరిమితిని తొలగించేందుకు అనుమతించింది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top